JANGITISRINIVASMUDIRAJ96

Apr 18 2024, 23:05

పాలనపై అవగాహన లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యావు... సుప్రీంకోర్టులో లేని ముదిరాజుల కేసును ఎలా వాదిస్తావు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

పాలనపై అవగాహన లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యావు...

సుప్రీంకోర్టులో లేని ముదిరాజుల కేసును ఎలా వాదిస్తావు!

 

ముదిరాజుల బీసీ ఏ అంశం బీసీ కమిషన్ వద్ద ఉన్నది మీకు తెలియదా?

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ 

చిన్నకోడూరు 

పాలనపై అవగాహన లేక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఎలా అయ్యావని రేవంత్ రెడ్డిని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏ కి మార్చే అంశం సుప్రీంకోర్టులో ఉందని మంచి లాయర్ ను పెట్టి వాదిస్తానన్నడం,రేవంత్ రెడ్డికి తెలువకన, లేక ముదిరాజులను మోసం చేయడ మా అన్నారు. సుప్రీంకోర్టు గతంలోనే ముదిరాజులను బీసీఏలోకి మార్చాలని బీసీ కమిషన్ కు ఆదేశాలు పంపించిందని అన్నారు. నేటి వరకు బీసీ కమిషన్ దగ్గర ఉన్న ఫైల్ ను కదిలించడం లేదన్నరు. బీసీ కమిషన్ వద్ద ఉన్న ఫైల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా తెప్పించుకొని ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలను ముదిరాజులు నమ్మే ప్రసక్తి లేదన్నారు. మరోసారి నమ్మి మోసపోలేమని, ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చి, బీసీఏలోకి మారుస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేస్తేనే ముదిరాజ్ సమాజం రేవంత్ రెడ్డిని నమ్ముతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు కీసరి పాపయ్య ముదిరాజు, పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మిద్దె రవి ముదిరాజు, యువత జిల్లా అధ్యక్షుడు పడిగ లింగం ముదిరాజు పాల్గొన్నారు

JANGITISRINIVASMUDIRAJ96

Apr 13 2024, 06:47

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ జేఏసీ నాయకులు! ముదిరాజులను బి.సి "డి" నుండి బి.సి "ఏ" లోకి చేర్చండి! ముఖ్యమంత్రిని కోరిన పోల్కం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ జేఏసీ నాయకులు!

ముదిరాజులను బి.సి "డి" నుండి బి.సి "ఏ" లోకి చేర్చండి!

ముఖ్యమంత్రిని కోరిన పోల్కం లక్ష్మి నారాయణ ముదిరాజ్!

ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పొల్కం లక్ష్మి నారాయణ గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ సమస్యల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది .

ముదిరాజ్ ల 60 సంవత్సరాలు ఆశయం , ముదిరాజ్ ల ప్రధాన సమస్య అయిన బీసీ డి నుండి బీసీ ఎ కి మార్చాలని కోరడం జరిగింది.

ముదిరాజ్ లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా ముదిరాజ్ కార్పొరేషన్ కి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాల్సింది గా విజ్ఞప్తి చేయగా సానుకూలం గా స్పందించారు.60 లక్షల ముదిరాజ్ లు గల ఈ రాష్ట్రం లో ముదిరాజ్ లు రాజకీయం గా వెనబడ్డారని ,రానున్న రోజుల్లో కొత్తగా ఇచ్చే నామినేటేడు మరియు కార్పొరేషన్ చైర్మన్ లు ముదిరాజ్ లకు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా పరిశీలిస్తాం అని హామీ ఇచ్చారు . ఈ సంద్భంగా ముఖ్యమంత్రి గారిని కలిసిన వారి లో ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పోల్కాం లక్ష్మి నారాయణ ముదిరాజ్ గారు,మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు లింగాల పుష్పాల త ముదిరాజ్ గారు, వైస్ చైర్మన్ సుధాకర్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ ముదిరాజ్ ,నీరజ ముదిరాజ్ లు,ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ కలరు.

JANGITISRINIVASMUDIRAJ96

Apr 11 2024, 07:11

రైతుల బతుకులు ఆగం జేత్తున్న రేవంత్ రెడ్డి! పొద్దుతిరుగుడు ధాన్యం మార్కెట్లో పోసి నెలలు గడుస్తున్న కొనుగోలు చేయరా? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

రైతుల బతుకులు ఆగం జేత్తున్న రేవంత్ రెడ్డి!

పొద్దుతిరుగుడు ధాన్యం మార్కెట్లో పోసి నెలలు గడుస్తున్న కొనుగోలు చేయరా?

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంట్టే కొనుగోలు ఆగి ఉండేవి కావు!

రైతులంట్టే కేసీఆర్

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బిఆర్స్ నాయకులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రైతులకు హామీ ఇస్తూ మద్దతు ధరతోని రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులకు అండగా ఉంటామని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి ఈనాడు రైతు పండించిన పొద్దు తిరుగుడు దాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బిఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

చిన్నకోడూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు బుధవారం నాడు సందర్శించిన ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు యమగండంలా మారిందని గతంలో ఎన్నికలకు ముందు రైతులకు బోనస్ తో పాటుగా ప్రతి గింజలు కొనుగోలు చేస్తామని ప్రగల్బాల్ పలికి ఈనాడు రైతు జీవితాన్ని గాలికి రేవంత్ రెడ్డి మీకు తగిన గుణపాఠం చెప్పదన్నారు ఈ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క గింజ కూడా కళ్ళల్లో ఉండేది కాదని గతంలో పాలనలో రైతులకు ఏనాడూ కూడా ఇబ్బంది కలగనీయలేదని సకాలంలో ఎరువులు అందించి వచ్చిన దిగుబడి ప్రతి గింజను కొనుగోలు చేసిన గణత కేసీఆర్ దక్కుతుందని అన్నారు ఆయనతో పాటుగా ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సుంచు రమేష్ బోస్సే ప్రభాకర్ రైతులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Apr 07 2024, 11:22

సమాచార హక్కు చట్టం గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలి! అవినీతిపరుల గుంద్దెల్లో సింహస్వప్నం సమాచార హక్కు చట్టం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

సమాచార హక్కు చట్టం గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలి!

అవినీతిపరుల గుంద్దెల్లో సింహస్వప్నం సమాచార హక్కు చట్టం!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఆర్.టీ.ఐ పిసి వ్యవస్థాపక అధ్యక్షులు

జిల్లాలోని అంబేద్కర్ భవన్లో సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు, వరంగల్ జిల్లా అధ్యక్షులు కాట కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న జాతీయ కమిటీ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అవగాహనలు సమాచార హక్కును విలువైన పౌర హక్కుగా గుర్తించిన నేపథ్యంలో పార్లమెంట్ సమాచార హక్కు చట్టాన్ని 12 /10 /2005 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నదని తెలిపారు.

ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక పౌర సమాచార అధికారి ఈ చట్టం పేర్కొన్న విధులను నిర్వహిస్తూ ఉంటారని ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రకారం రికార్డులు దస్తావేజులు మెమోలు ఈ-మెయిల్ అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్కులర్లు, ఉత్తర్వులు, రిజిస్టర్లు, కాంట్రాక్టులు, నివేదిక నమూనాలు, క్రోడీకరించబడిన సమాచార గ్రంథం లిఖితపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిక్షిప్తం చేయబడి ప్రతి అంశం సమాచార అధికారి సెక్షన్- 8 లో ఇచ్చిన నిబంధనలకు లోబడి సమాచారం కాపీలను అర్జీదారునికి అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థను జవాబు దారితనంతో అవినీతి రహితంగా పని చేయాలంటే ప్రజలు తమ బాధ్యతను సక్రమంగా పోషించాలని కోరారు.

అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సక్రమంగా అమలవుతుందని ప్రజలందరికీ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించి వారిని చైతన్య పరిచి సహ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని సభ్యులను కోరారు. కొన్ని ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల సహ చట్టం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, నమీండ్ల హరీష్, వీరేందర్ రెడ్డి, డాక్టర్ కీర్తి రెడ్డి, వెంకటేష్ యాదవ్, మల్లె పాక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు.

JANGITISRINIVASMUDIRAJ96

Mar 29 2024, 17:13

మా హక్కులను కాల రాస్తే సహించేది లేదు.... లక్ష్మీనారాయణ

మా హక్కులను కాల రాస్తే సహించేది లేదు.... 

కుల బహిష్కరణ చేయడమేంటి ?

ఇంకా మనము ఏ కాలంలో ఉన్నాం 

రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పోల్కం లక్ష్మీనారాయణ 

సిద్దిపేట న్యూస్

మా హక్కులను కాల రాస్తే సహించేది లేదని రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పోల్కం లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం సిద్దిపేట లో మీడియా సమావేశంలో మాట్లాడారు సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులను బహిష్కరించడంపై ఆయన మండిపడ్డారు. ఏ నాగరికతలో జీవిస్తున్నామని మా జాతి బిడ్డలను బహిష్కరించడమేంటి అన్నారు. స్వసంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన మా ముదిరాజులపై అణిచివేత ధోరణి మార్చుకో లేదన్నారు. మా ముదిరాజ్ బిడ్డలు మా చేపలు పట్టడం మా అక్కని ప్రశ్నించినందుకే వెలివేయడం ఏమైనా చర్య అన్నారు. తెలంగాణ పల్లె జిల్లాల్లో మా ముదిరాజ్ కులస్తులని గ్రామ బహిష్కరణలు వెలివేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. మా పోరాటం అహింస మార్గంలోనే మా హక్కులను సాధించుకుంటామన్నారు. ప్రభుత్వాము స్పందించకపోతే రాష్ట్రంలోని ముదిరాజులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మా సమస్యను వినిపిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి త్వరగా మా ముదిరాజులకు సొసైటీ ఏర్పాటు చేసి చెరువులను ముదిరాజులకు అప్పగించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా చైర్మన్ లింగాల పుష్పలత,రాష్ట్ర ముదిరాజ్ జేసి వైస్ చైర్మన్ లు పగిడాల సుధాకర్, జంగిటి శ్రీనివాస్ముదిరాజ్, ఉస్తేమ్ శ్రీనివాస్, జిల్లా చైర్మన్  గుంటుకు శ్రీనివాస్, వైస్ చైర్మన్ చికెన్ సత్తి, జిల్లా మీడియా ఇంన్ చార్జ్ పుప్పాల బాలేష్ ,తూప్రాన్ మండల చైర్మన్ ఇమాంపూర్ వెంకటయ్యా, వైస్ చైర్మన్ వెంగలి వెంకతేష్ , జనరల్ సెక్రెటరీ పిట్ల సాయిబాబా, ఖాజీపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పెండేలా గణేష్, ఖాజీపూర్ ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు

JANGITISRINIVASMUDIRAJ96

Mar 28 2024, 15:16

ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు ఉన్నట్ల లేనట్ల! పొద్దుతిరుగుడు ధ్యానం ప్రభుత్వం ఎందుకు కొనడంలేదు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు ఉన్నట్ల లేనట్ల!

పొద్దుతిరుగుడు ధ్యానం ప్రభుత్వం ఎందుకు కొనడంలేదు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 28-03-2024 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం పొద్దుతిరుగుడు ధ్యానం కొనుగోలు చేయడానికి మార్క్ పేడ్ సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఒక్క వారం కూడ తూకం వేయకుండానే కొనుగోలు నిలిపివేయడంతో ధాన్యం తెచ్చిన రైతులు రోజుల తరబడి అధికారులు కనికరం చూపడం లేదని బీఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

గురువారం నాడు ధాన్యం నిల్వలను సంబంధిత రైతులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా జంగిటి మాట్లాడుతూ పథకాల పేరుతో ప్రచారానికి పరిమితమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు పండించిన సన్ ప్లవర్ ధాన్యం కొనుగోలు మరిచారని అన్నారు గత ఇరువై రోజులుగా రైతులు ధాన్యం కుప్పలవద్ద పడిగాపులు కాస్తుంనరని కనీసం మంచ్చి నీల్లు ఇచ్చే నాధుడు కరువైయారని అన్నారు రెపట్టివరకు కొనుగోలు ప్రారంభించకుంటే రైతులతో కలసి రామునిపట్ల వద్ద రాజీవ్ రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు వారితో రైతులు రాజిరెడ్డి, రాములు, రంగారెడ్డి, ప్రతాపరెడ్డి, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Mar 27 2024, 07:08

ఖాజీపూర్ కు న్యాయం జరగకపోతే ముదిరాజ్ లము ఎన్నికలకు దూరం... రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఖాజీపూర్ కు న్యాయం జరగకపోతే ముదిరాజ్ లము ఎన్నికలకు దూరం...

రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ 

అక్బర్ పేట/ భూంపల్లీ

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట మండలం భూంపల్లి గ్రామ ముదిరాజులకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు దూరంగా ఉంటామని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దుబ్బాక నియోజకవర్గం ముదిరాజ్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఖాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తులను గ్రామ బహిష్కరణ చేయడంపై మండిపడ్డారు. ఘాజీపూర్ గ్రామంలో సొంత రాజ్యాంగం ఉన్నట్లుగా అక్కడి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పించిన చట్టబద్ధతను కూడా గ్రామస్తులు తుంగలో తొక్కి ముదిరాజ్ మధ్య సంపదపై మీకు హక్కు ఉండదని ఉకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ముదిరాజులను సామాజిక వెలివేతకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ గారికి వచ్చే నెల ఒకటో తారీకు వరకు ముదిరాజులకు న్యాయం జరిగిందని అధికారిక ప్రకటన రాకుంటే ముదిరాజులం ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరి ఇందులో పాల్గొంటున్న రాజకీయ నాయకులపై ఆయా పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే ఆ పార్టీలను కూడా ముదురాజుల వద్దకు రానివ్వమన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జేఏసీ సిద్దిపేట జిల్లా నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ పడిగా ప్రశాంత్ ముదిరాజ్, దుబ్బాక నియోజకవర్గం కన్వీనర్ చికెన్ సత్తి, దుబ్బాక ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తోట్ల మల్లేశం, ముదిరాజ్ నాయకులు రమేష్, భూపతి, గణేష్, నరసింహులు,

JANGITISRINIVASMUDIRAJ96

Mar 22 2024, 22:45

కాజిపూర్ ముదిరాజులబైస్కరణ అప్రజాస్వామికం! ముదిరాజులను వెలేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

కాజిపూర్ ముదిరాజులబైస్కరణ అప్రజాస్వామికం!

ముదిరాజులను వెలేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

తేది: 22-03-2024 శుక్రవారం

కలెక్టరేట్ న్యూస్

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి మండల్ ఖాజీపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కుటుంబాలను కొందరు భయభ్రాంతులకు గురిచేసి వెలివేశారు వెలువేద గురైన 30 ముదిరాజ్ కుటుంబాలు శుక్రవారం రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని మరియు పోలీస్ కమిషనర్ గారిని కలిసి వారికి జరిగిన అన్యాయంపై రాతపూర్వకంగా మేమోరాండం ఇచ్చారు విషయం తెలుసుకున్న ముదిరాజ్ ప్రతినిధులు ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సుతారి రాజు నియోజకవర్గ కన్వీనర్ పడిగే ప్రశాంత్ టౌన్ అధ్యక్షులు మిద్దె రవి ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ యూత్ కన్వీనర్ చెంది శ్రీనివాస్ నాయకులు కిష్ణపురం లక్ష్మణ్ యాట రాజేష్ పడిగే లింగం రాగులు రాజు చింతమడక రాజన్నలు వెలివేతకు గురైన ముదిరాజ్ కుటుంబాలకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మనుషులు మనుషులని వెలివేయడం ఏమిటని ఇది ఏమైనా రాచరిక పాలన అని ముదిరాజులు అంటేనే చులకనగా చూస్తూ చెరువులో చేపలు పట్టవద్దని సొసైటీలు చేసుకోవద్దని ఆంక్షలు విధించి గ్రామ బహిష్కరణ చేయడము ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు జీవో నెంబర్ 98/1964 ప్రకారం ముదిరాజులు మత్స్యకారులని మత్స్య సంపదపై చెరువులపై ముదిరాజ్లకు సర్వహక్కులు ఉన్నాయని ప్రభుత్వం ఇచ్చిన జీవోని సైతం కాదంటూ గ్రామస్తులు కొంతమంది కవ్వింపు చర్యలు దిగుతూ ముదిరాజుల పైన గ్రామ బహిష్కరణ వేటు వేయడం సరైనది కాదన్నారు ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వెలివేసినటువంటి వ్యక్తులపైన చర్య తీసుకొని ముదిరాజులకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వెలివేతకు గురైన ముదిరాజ్ కుటుంబాలు ఉన్నారు

JANGITISRINIVASMUDIRAJ96

Feb 11 2024, 18:24

ముగిసిన జిల్లా స్థాయి స్మారక క్రికెట్ టోవర్నమెంట్!

ముగిసిన జిల్లా స్థాయి స్మారక క్రికెట్ టోవర్నమెంట్!

తేది: 11-02-24 ఆదివారం

చిన్నకోడూర్ న్యూస్

చిన్నకోడూర్ మండల కేంద్రంలో డ్రీమ్ లెవన్ టీమ్ సభ్యులు నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శేఖర్, విఘ్నేష్ ల స్మారక టోర్నమెంట్ ఈరోజు ముగిసింది గత 20 రోజులుగా 36 టీమ్ లు తలపడగా ఫైనల్ కు చేరిన మైలారం కమ్మర్లపల్లి, చిన్నకోడూర్ టీమ్ లు తలపడగా విన్నర్ గా మైలారం-కమ్మర్లపల్లి నిల్వగా చిన్నకోడూర్ రన్నర్ గా నిలిచింది ఇట్టి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉమేష్ చంద్ర, బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సీనియర్ క్రీడాకారులు హనుమయ్య, వార్డ్ మెంబర్ ఇట్టబోయిన శేఖర్, నాయకులు నిమ్మల వెంకటేశం, సామల అవినాష్, బీరయ్య లు ముఖ్య అతిథులుగా వచ్చి విన్నర్ గ నిలిచిన జట్టుకు 40 వేల రూపాయలు నగదు పారితోషికంతో పాటుగా బహుమతిని అందించారు రన్నర్ గా నిలిచిన జట్టుకు 20 వేల రూపాయలు నగదు పారితోషికంతో పాటుగా బహుమతిని అందించారు ముందుండి ఈ టోవర్నమెంట్ నిర్వహించిన ఏయ్య ప్రసాద్, గుడిసె పవన్ లను అభినందించారు.

JANGITISRINIVASMUDIRAJ96

Feb 01 2024, 18:10

కేంద్ర బడ్జెట్ పేదలకు అందని ద్రాక్షే! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

కేంద్ర బడ్జెట్ పేదలకు అందని ద్రాక్షే!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 01-02-2024 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పేదలకు ఆశచూపినట్లు ఉందని అది పేదలకు అందేవిదంగా లేదని బి.ఆర్.ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మోడీ పది సంవత్సరాల క్రితం కుబేరుల వద్ద మూలుగుతున్న నల్లధనాన్ని బైటకు తీసి పేదలకు ఒక్కో అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తానని వాగ్దానం చేసి గద్దెనెక్కినాక నల్లధనం తియ్యకపోగా పేదలకు అందే సబ్సిడీలను తీసేసి కార్పొరేట్ సంస్థల కొమ్ముకాస్తున్నాడని అన్నారు.

గత ఎన్నికల్లో యువత మదిలో హిందు వాదం నింప్పి మతాల మధ్య చిచ్చుపెట్టి గద్దెనెక్యారని అన్నారు.

మూడోసారి గద్దెనెక్కడానికి మధ్యంతర బడ్జెట్ అంట్టు కొత్త నాటకానికి తీశారని అన్నారు.

గత పది సంవత్సరాలల్లో 250 మిలియండ్ల పెదాలను అభివృద్ధిలోకి తెచ్చినట్లు ప్రకటించడం హాహ్యస్పదమని అన్నారు.

ఇది కేవలం ఎన్నికల కోసం ప్రకటన తప్పితే ఏమి లేదన్నారు.